- సిటీ సెంట్రల్ లైబ్రరీకే ఇంటర్నెట్ ఫెసిలిటీ
- నిరుద్యోగులు, స్టూడెంట్లు, సీనియర్ సిటిజన్లకు ఇబ్బందులు
- లైబ్రరీలకు బల్దియా బకాయిలు రూ. 749 కోట్లు
“ స్టూడెంట్లు, నిరుద్యోగుల కోసం సిటీలో ఈ – లైబ్రరీలు ఏర్పాటు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తాం.. సీనియర్ సిటిజన్ల కోసం ప్రతి డివిజన్లో లైబ్రరీ, సీనియర్ సిటిజన్స్ క్లబ్, యోగా సెంటర్, జిమ్ ఏర్పాటు, ఫ్రీ గా బస్పాసులు ఇస్తాం.’’ ఇది 2020, డిసెంబర్లో గ్రేటర్ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ.
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను మర్చిపోయింది. సిటీ డెవలప్ మెంట్ తన బాధ్యతని, మేనిఫెస్టోలోని హామీలను దగ్గరుండి అమలు చేయిస్తానని గతేడాది బల్దియా ఎన్నికల టైమ్లో మంత్రి కేటీఆర్ చెప్పారు. పది నెలలు దాటినా పట్టించుకోవడంలేదు. స్టూడెంట్లు, నిరుద్యోగులకు ఈ–లైబ్రరీలు, ఇంటర్నెట్ ఫెసిలిటీ, సీనియర్ సిటిజన్స్కు ప్రతి డివిజన్లో లైబ్రరీ, జిమ్, యోగా సెంటర్లు పెట్టిస్తానని మేనిఫెస్టోలోనూ పెట్టారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. స్టూడెంట్లు , నిరుద్యోగులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కోసం ప్రైవేట్ రీడింగ్ సెంటర్లకు వెళ్తుండగా, స్తోమత లేని వారు చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ సమీపంలో అద్దెకు ఉంటూ ప్రిపేర్ అవుతున్నారు. ఈ–లైబ్రరీలను అందుబాటులోకి తీసుకొస్తే వివిధ ప్రాంతాల వారు అక్కడే ఉండి చదువుకునేందుకు వీలుంటుంది.
కొత్తవి లేవు.. ఉన్నవే తగ్గుతున్నయ్
సిటీలో మరిన్ని లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ హామీ ఇచ్చింది. మరోవైపు ఉన్న లైబ్రరీలు తగ్గిపోతున్నాయి. పదేళ్ల క్రితం 89 లైబ్రరీలుండగా, ప్రస్తుతం 82 మాత్రమే ఉన్నాయి. కొన్నింటి భవనాలు శిథిలావస్థకు చేరుకోవడం, మరికొన్నింటికి సొంత భవనాలు లేకపోవడంతో 7 లైబ్రరీలు ఖాళీ అయ్యాయి. వాటిస్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం కొన్ని భవనాల నిర్మాణ పనులు జరుగుతున్నా ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. మంత్రి కేటీఆర్హామీ ప్రకారం చూస్తే 150 డివిజన్లలో 150 ఈ–లైబ్రరీలు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది.
బల్దియా రూ.749 కోట్లు బకాయి
బల్దియాకు చెల్లించే పన్నులోంచి అందాల్సిన లైబ్రరీ సెస్10 ఏళ్లుగా నిలిచిపోయింది. 8 శాతం గ్రంథాలయ సెస్ ను పన్నుల రూపంలో వసూలు చేస్తుండగా, లైబ్రరీలకు మాత్రం బల్దియా ఇవ్వడం లేదు. ప్రతి నెలా మెయింటెనెన్స్ కోసం రూ.15 లక్షలు మాత్రమే చెల్లిస్తుంది. తెలంగాణ ఏర్పడిన మొదటి ఏడాది కరెంట్బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అప్పటి నుంచి ప్రతి నెలా మెయింటెనెన్స్నిధులను బల్దియా రిలీజ్ చేస్తుంది. గత పదేండ్లుగా రూ.749 కోట్లు గ్రేటర్లోని లైబ్రరీలకు బల్దియా బకాయి పడింది. ఫండ్స్ ఇవ్వక పోవడంతో ఆ ప్రభావం రీడర్స్ పైన పడుతోంది. ఫండ్స్ అందుబాటులో లేక రీడర్స్కు కావాల్సిన మెటీరియల్ టైమ్కు అందడం లేదు. జనం నుంచి వసూలు చేస్తున్న డబ్బులను ఖర్చు పెట్టడానికి బల్దియా ముందుకు రాకపోవడంపై సిటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిటీలోని ప్రతి లైబ్రరీ నిర్వహణకు కనీసం రూ.1 కోటి వరకు నిధులు కావాలి. సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఇంతకు ఎక్కువే ఖర్చవుతుంది.
నెట్ సౌకర్యం కల్పించాలె
టెక్నాలజీ పెరుగుతున్నా లైబ్రరీల్లో పెద్దగా మార్పులు రావడంలేదు. జిల్లాల్లోని లైబ్రరీల్లో అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే ఎగ్జామ్స్ప్రిపరేషన్ కోసం సిటీకి రావాల్సిన అవసరం ఉండదు. ఇంటి అద్దె చెల్లిస్తూ చిక్కడపల్లిలోని సిటీ లైబ్రరీలో కాంపిటేటివ్కు ప్రిపేర్అవుతున్నా.
- వినోద్ కుమార్, టేకులపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
లైబ్రరీ లేక.. ఇంట్లోనే..
కాంపిటేటివ్ఎగ్జామ్స్కు బుక్స్కొని చదువుతున్నా. దగ్గరలో లైబ్రరీ లేదు. ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నా. ఇంటర్ నెట్ఫెసిలిటీతో ఈ–లైబ్రరీలు ఏర్పాటు చేస్తే ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది. ప్రభుత్వం వెంటనే పట్టించుకోవాలె. - జలజ, ఎంఏ, బీఈడీ, అత్తాపూర్