సుందెలుక పడిన నీళ్లు తాగిన పిల్లలకు తీవ్ర అస్వస్థత

సుందెలుక పడిన నీళ్లు తాగిన పిల్లలకు తీవ్ర అస్వస్థత

శివ్వంపేట, వెలుగు: మెదక్  జిల్లా శివ్వంపేట మండలం రత్నాపూర్  అంగన్ వాడీ సెంటర్​లో  సుందెలుక పడిన నీళ్లు తాగిన పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అంగన్ వాడీ సెంటర్​లోని బిందెలో శనివారం సుందెలుక పడి చనిపోగా, ఈ విషయాన్ని గమనించకుండా ఆ బిందెలో నీళ్లు తాగిన 8 మంది పిల్లలు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. 

వారిని నర్సాపూర్  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, రాత్రి వరకు అబ్జర్వేషన్​లో ఉంచిన డాక్టర్లు  సాయంత్రం ఇండ్లకు పంపించారు. కాగా, రాత్రి కొంత మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొందరికి వాంతులు కాగా, మరి కొందరికి పొట్ట బాగా ఉబ్బింది. దీంతో ఆందోళనకు గురైన తల్లి దండ్రులు వారిని మళ్లీ ఆసుపత్రికి తరలించారు.