
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లిలో భారీ బతుకమ్మను ఆటోలో తరలిస్తుండగా హైటెన్షన్ వైర్లు తగిలి నలుగురు గాయప్డడారు. వివేకానందనగర్డివిజన్పరిధిలోని పాపారాయుడు నగర్ దేవిస్తాన్ విల్లాస్లో బతుకమ్మను భారీగా పేర్చారు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ బతుకమ్మను విల్లాస్నుంచి కూకట్పల్లి వైపు ట్రాలీ ఆటోలో తీసుకెళ్తుండగా, బతుకమ్మ చుట్టూ అమర్చిన ఐరన్రాడ్స్హైటెన్షన్వైర్లకు తగిలాయి. దీంతో ఆటోలో ఉన్న స్థానికులు జాన్పాషా(40), కాశయ్య(40)తో పాటు మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. వీరంతా ఓ ప్రైవేటు హాస్పిటల్లో ఔట్పేషెంట్స్గా ట్రీట్మెంట్ తీసుకొని వెళ్లిపోయారు. ఈ ఘటనపై కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.