EmraanHashmi: డెంగ్యూను జయించిన ‘ఓజీ’ విలన్.. ఫినిషింగ్‌ టచ్ ఇవ్వడానికి తిరిగి బరిలోకి

EmraanHashmi: డెంగ్యూను జయించిన ‘ఓజీ’ విలన్.. ఫినిషింగ్‌ టచ్ ఇవ్వడానికి తిరిగి బరిలోకి

బాలీవుడ్ స్టార్ యాక్టర్, ఓజీ మూవీ విలన్ ఇమ్రాన్ హష్మీ డెంగ్యూను జయించాడు. మే 28,2025న ఇమ్రాన్కి డెంగ్యూ ఉన్నట్లు నిర్ధారణ అవ్వడంతో షూటింగ్కి బ్రేక్ ఇచ్చాడు. లేటెస్ట్గా ఇమ్రాన్ డెంగ్యూ నుంచి పూర్తిగా కోలుకుని ‘ఓజీ’సెట్లో అడుగుపెట్టాడు. ముంబైలో జరుగుతున్న కీలక షెడ్యూల్లో పాల్గొన్నాడు. 

ఈ అప్‌డేట్‌ను ఇమ్రాన్ తన ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నాడు. ‘మళ్ళీ సెట్లో అడుగుపెట్టడం చాలా ఆనందాన్ని ఇస్తోంది. డెంగ్యూ నుండి కోలుకోవడానికి నేను కొంత టైం తీసుకున్నాను, కానీ ఇప్పుడు నేను పూర్తిగా కోలుకుని సెట్‌లోకి తిరిగి వచ్చాను. అందుకు కారణమైన మీ ప్రేమ మరియు ప్రార్థనలకు ధన్యవాదాలు!’అని ఇమ్రాన్ తెలిపాడు. 

ALSO READ | Kannappa Bookings: ‘కన్నప్ప’ రిలీజ్కు సర్వం సిద్ధం.. టికెట్ బుకింగ్స్ ఓపెన్

ఇటీవలే డైరెక్టర్ సుజీత్.. పవన్ పోర్షన్‌‌‌‌కు సంబంధించిన ‘ఓజీ’ షూటింగ్ కంప్లీట్ చేశాడు. ఇక మిగతా ఆర్టిస్టులతో ఉన్న బ్యాలెన్స్ షూట్‌‌‌‌ను ముంబై లో తెరకెక్కిస్తున్నాడు. ఈ కీలక షెడ్యూల్ లోనే ఇమ్రాన్‌ హష్మీపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇప్పుడీ ఫినిషింగ్‌ సీన్స్‌ కంప్లీట్ చేస్తే 'ఓజీ' మొత్తం షూటింగ్‌ పూర్తి కాబోతుంది. ఈ లేటెస్ట్ షెడ్యూల్ 10 రోజులపాటు జరగనుంది. 

 ఇమ్రాన్ హష్మి 'ఓజీ' మూవీతోనే తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. ఇది అతని కెరీర్‌లో స్పెషల్ ఫిల్మ్ కానుంది. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ మూవీలో ఇమ్రాన్ 'ఓం భావు' అనే కీలక పాత్రను పోషిస్తున్నాడు. 

ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ ప్రాజెక్టులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా 'ఓజీ' విడుదల కానుంది.