ఈటల దళితులను రెచ్చగొడుతున్నారు

ఈటల దళితులను రెచ్చగొడుతున్నారు

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ దళితులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చొప్పదంటి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంటలో ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయన..మంత్రివర్గంలో ఉన్నప్పుడు దళితులపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సీఎంవో లో దళితుల్లేరన్నంటున్న ఈటల మతిభ్రమించిందన్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ దళితుడన్న సంగతి మరిచిపోయారన్నారు. ఈటల తన సొంత డబ్బా కొట్టుకోవడంతో బీజేపీ అధిష్టానం అతనిపై సీరియస్ అయ్యిందన్నారు. దళితుల కోసం సీఎం కేసీఆర్ వందలాది కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు సహాయం అందజేశామని తెలిపారు.