నారప్ప కోసం మహిళా ఫ్యాన్ సూసైడ్ అటెంప్ట్

నారప్ప కోసం  మహిళా ఫ్యాన్ సూసైడ్ అటెంప్ట్

ఈనాడు, ఘర్షణ,దృశ్యం,గురు లాంటి వైవిధ్యభరితమైన సినిమాలతో తన సత్తా చాటిన విక్టరీ వెంకటేశ్ మరో థ్రిల్లింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వెంకీ హీరోగా నటించిన  నారప్ప త్వరలోనే ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. తమిళంలో ధనుష్ హీరోగా చేసిన అసురన్ సినిమాకి రీమేకే నారప్ప సినిమా . అక్కడ ఆ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ధనుష్ కెరియర్లోనే వైవిధ్యభరితమైన సినిమాగా నిలిచింది. భారీ వసూళ్లతో పాటు ప్రశంసలను కూడా తెచ్చిపెట్టింది. దీంతో శ్రీకాంత్ అడ్డాల తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని వెంకటేశ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గుట్టుగా ఈ సినిమాను తెరకెక్కించాడు,  సురేశ్ బాబు .. కలైపులి థాను నిర్మించిన ఈ మూవీ.. సెన్సార్ కార్యక్రమాలను ఇటీవలే పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ ను మంజూరు చేశారు.

ఒక సూసైడ్ అటెంప్ట్.. మరొకరు నిరాహార దీక్ష

వాస్తవానికి నారప్ప సినిమా ఈ పాటికే  విడుదల కావలసింది. అయితే కరోనా వలన పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో విడుదల చేయలేదు. ఇక ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తుందనే టాక్ ఒక వైపున వినిపిస్తుంటే, లేదు థియేటర్లకే వస్తుందని మరికొంతమంది అంటున్నారు. ఈ క్రమంలోనే వెంకీ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచి మెసేజ్ ఉన్న ఇంత మంచి సినిమాను థియేటర్ లోనే రిలీజ్ చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని రేణిగుంటకు చెందిన సునీత అనే అభిమాని నారప్ప సినిమాను థియేటర్ లోనే రిలీజ్ చేయాలంటూ సూసైడ్ అటెంప్ట్ చేయగా.. వరంగల్‌కు చెందిన కిరణ్ అనే ఫ్యాన్ ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టాడు. ఇలా మొత్తానికి నారప్ప సినిమా రిలీజ్ కి ముందే హైప్ వస్తుండటంతో అటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా రిలీజ్ విషయంలో సినిమా యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. నారప్పలో వెంకటేశ్ భార్య పాత్రలో ప్రియమణి నటించగా, ప్రకాశ్ రాజ్ .. సంపత్ రాజ్ .. మురళీశర్మ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.