
- న్యూజివీడు విత్తనాల కంపెనీ ఎదుట రైతుల ఆందోళన
జీడిమెట్ల, వెలుగు: పంట కొనుగోలు చేసి తొమ్మి ది నెలలు గడుస్తున్నా తమకు డబ్బులు ఇవ్వట్లేదని రైతులు ఆందోళనకు దిగారు. గురువారం దూలపల్లిలోని న్యూజివీడు సీడ్స్ కంపెనీ ఎదుట మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం గోరిల్లా తండాకు చెందిన రైతులు టెంట్ వేసుకుని ఆందోళన చేశారు.
వారు మాట్లాడుతూ.. న్యూజివీడు సీడ్స్ కంపెనీ 150 మంది రైతుల నుంచి రూ.కోటి 50 లక్షల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు. 9 నెలలుగా గడుస్తున్నా పేమెంట్లు మాత్రం చేయడం లేదన్నారు. తాము ఇప్పుడు పంటలు సాగుచేయాలంటే పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. యాజమాన్యం ఆర్గనైజర్ సత్యనారాయణ వారితో చర్చలు జరిపి త్వరలో చెల్లిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.