ఖమ్మం: వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మరోసారి నోరు జారారు. జిల్లాలోని కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే రాముల్ నాయక్ అధ్యక్షతన వైరా నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ.. కార్యకర్తలు తాలిబన్లు, నక్సలైట్లుగా ఉద్యమించాలని బహిరంగంగా పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రాములు నాయక్ ఇలాంటి కామెంట్లు చేసిన వైనం కలకలం రేపింది.