కొత్త సంవత్సరం వేడుకలను నిర్వహించే ఫామ్ హౌస్ లు, ఫంక్షన్ హాళ్ల పై గట్టిగా నిఘా వేస్తున్నట్లు శంషాబాద్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మోతాదుకు మించి లిక్కర్ తీసుకున్నా... అనుమతి లేకుండా ఈవెంట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.సెలబ్రేషన్స్ జరుపుకొనేందుకు లైసెన్సులు తీసుకోవాలని కోరారు. ఫ్యామిలీ ఫంక్షన్లకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.గా పెద్ద ఈవెంట్లకు సంబంధించి ఇన్స్పెక్టర్ల దరఖాస్తు చేసుకుంటే అన్ని విధాలుగా విచారణ జరిపి అనుమతులు ఇస్తామన్నారు.
డిసెంబర్ 31 రోజు రాత్రి అన్ని రకాల బార్లకు రాత్రి ఒంటిగంట వరకు అనుమతిచ్చారు. కమర్షియల్ ఈవెంట్లకు సంబంధించి ఆషామాషిగా ఇబ్బడిముబ్బడిగా అనుమతులు ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. పర్మిషన్ లేకుండా ఈవెంట్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు