- దొంగనోట్ల పేరున బురిడీ కొట్టిస్తున్న ఇద్దరి అరెస్ట్
- 30 కట్టల బ్లాక్ పేపర్స్, అయోడిన్, నిమ్మరసం సీజ్
హనుమకొండ, వెలుగు: రూ.లక్షకు మూడు రెట్ల నకిలీ నోట్లు ఇస్తామని, వాటిని మార్కెట్లో ఈజీగా మార్చవచ్చంటూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను వరంగల్సీసీఎస్, మట్వడా పోలీసులు అరెస్ట్చేశారు. వరంగల్ సీపీ డా. తరుణ్జోషి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన గనిశెట్టి నగేశ్, రాజమండ్రికి చెందిన గొర్రెల మురళీమోహన్ఇద్దరూ ఫ్రెండ్స్. నగేశ్ఏసీ మెకానిక్కాగా మురళీ మోహన్కార్డ్రైవర్. ఇద్దరూ జల్సాలకు అలవాటుపడ్డారు. వచ్చే ఆదాయం ఖర్చులకు సరిపోక ఈజీగా మనీ సంపాదించాలని నిర్ణయించుకున్నారు. నోట్ల మార్పిడి పేరుతో మోసానికి తెరలేపారు. ముందస్తు ప్లాన్ప్రకారం నగేశ్, మురళీమోహన్అమాయక జనాలను టార్గెట్చేసుకుని వారితో మాట కలిపేవారు. అనంతరం తమ వద్ద నకిలీ నోట్లు ఉన్నాయని చెప్పేవారు. రూ.లక్ష ఇస్తే అందుకు మూడు రెట్ల విలువైన నకిలీ నోట్లు ఇస్తామని, వాటిని మార్కెట్లో చెలామణి చేసుకోవచ్చని నమ్మబలికేవారు. ఎవరైనా అందుకు అంగీకరిస్తే రూ.500 నోటుకు సరిపడా సైజులో ఉండే నల్లకాగితాల కట్టలను వారికి ఇచ్చేవారు. ముందస్తు ప్లాన్ ప్రకారం నాలుగైదు అసలైన రూ.500 నోట్లకు బ్లాక్కలర్వేసి అదే నల్ల కాగితాల కట్టలో పెట్టేవారు. ఆ బ్లాక్నోట్లను అయోడిన్ టోనర్, నిమ్మరసంలో ముంచితే అసలైన కరెన్సీ కనిపిస్తుందని చెప్పేవారు. వారి ముందే టెస్ట్ చేస్తున్నట్లు నటించేవారు. బ్లాక్కలర్వేసిన ఒరిజినల్నోట్లను ఆయా లిక్విడ్స్లో ముంచి జనాలను బోల్తా కొట్టించేవారు. అనంతరం వారికి బ్లాక్కలర్పేపర్స్అంటగట్టి అక్కడి నుంచి ఉడాయించేవారు. రెండు నెలల కింద హైదరాబాద్ ఫిలింనగర్సమీపంలోని ఓ బార్లో వాజేడు మండలం చింతూరుకు చెందిన మేడిచెర్ల మోహన్ నిందితులిద్దరికి పరిచయం అయ్యాడు. ఆయనతో మాట కలిపిన నగేశ్, మురళీమోహన్నకిలీ నోట్లు ఉన్నాయని చెప్పారు. వారి మోసాన్ని గ్రహించిన ఆయన వారిని వరంగల్ ఎంజీఎం వద్దకు రమ్మని చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నిందితులిద్దరూ ఎంజీఎం సెంటర్కు రాగానే సీసీఎస్, మట్వాడా పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి నుంచి ఒక్కో దాంట్లో వంద కాగితాలు ఉండే 30 బ్లాక్పేపర్కట్టలు, అయోడిన్టోనర్, నిమ్మరసం బాటిల్, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన క్రైమ్స్అడిషనల్ డీసీపీ పుష్ప, క్రైమ్స్ఏసీపీ డేవిడ్రాజ్, సీసీఎస్ సీఐలు శ్రీనివాసరావు, రమేశ్కుమార్, మట్వాడా సీఐ రమేశ్ తదితరులను సీపీ అభినందించారు.
