గీతంలో బీ ఫార్మసీ సీట్లు పెంచేందుకు పీసీఐ గ్రీన్ సిగ్నల్

గీతంలో బీ ఫార్మసీ సీట్లు పెంచేందుకు పీసీఐ గ్రీన్ సిగ్నల్

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు:  సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​యూనివర్సిటీలో బీ ఫార్మసీ సీట్లను పెంచుకోవడానికి ఫార్మసీ కౌన్సిల్​ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది.  2025–-26 అకాడమిక్​ ఇయర్​ నుంచి అదనంగా 40 సీట్లకు అడ్మిషన్లు తీసుకోవడానికి అనుమతి లభించిందని స్కూల్​ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ జి. శివకుమార్​ బుధవారం తెలిపారు. ఈ మేరకు ఫార్మసీ కౌన్సిల్​ఆఫ్ ఇండియా రిజిస్ట్రార్, సెక్రటరీ నుంచి ఉత్తర్వులు అందుకున్నట్లు వెల్లడించారు. 

 బీ ఫార్మసీ సీట్ల పెంపుతో పాటు ఎం ఫార్మసీలోని ఫార్మాస్యూటిక్స్​, ఫార్మాకాలజీ కోర్సులో అనుమతించిన సీట్లను యథాతథంగా కొనసాగించడానికి ఆమోదం లభించిందని పేర్కొన్నారు.  పీసీఐ ఉత్తర్వుల విషయంలో గీతం ప్రోవీసీ​ డీఎస్​ రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్​ఆర్​ వర్మ, ఆయా శాఖల డైరెక్టర్లు, విభాగాధిపతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.  విద్యార్థుల అవకాశాలను పెంచి ఫార్మసీ నిపుణులను పెంచడంలో గీతం నిబద్ధతతో ముందుకు వెళ్తుందని చెప్పారు.