కుక్కలతో మనుషులకు విడదీయలేని అనుబంధం ఉంటుంది. తాజాగా ఓ పెళ్లికొడుకు బైక్పై తన కుక్కతో కలిసి పెళ్లి మండపానికి వెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దర్శన్ నందు అనే వ్యక్తి తన పెళ్లికి తాను కుక్కను తీసుకువెళ్లిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. షేర్వానీ ధరించి బైక్పై తన పెంపుడు కుక్కతో పెళ్లి వేడుకలోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చారు. కుక్క ముందు కూర్చోగా..అతడు బైక్ పై మండపంలోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఈ వీడియో 4 రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్లో 1.7 మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం. 2 లక్షలకు పైగా లైక్ లు వచ్చాయి. వరుడు చేసిన పనిని.. నెటిజన్లు మెచ్చుకున్నారు. చాలా క్యూట్ గా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.