ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా

ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా
  • 28, 29వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తాం: సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్: భారీ వర్షాలతో పరీక్షల గురించి బెంగపెట్టుకున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. గులాబ్ తుపాను రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తుండడంతో రేపు, ఎల్లుండి.. అంటే ఈనెల 28, 29వ తేదీల్లో జరగాల్సిన ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. వర్షాల కారణంగా ఈ రెండు రోజులు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశామని.. మళ్లీ ఎప్పుడు జరిపేది తర్వాత ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.