
మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో భాగంగా ఇవాళ టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్పై ఆసీస్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్కు చేరింది. తొలుత ఆసీస్ 172/4 స్కోరు సాధించగా.. భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసింది. హర్మన్ప్రీత్ కౌర్ (52), జెమీమా రోడ్రిగ్స్ (43), దీప్తి శర్మ (20) పరుగులతో రాణించినా భారత్ ఓటమిని చవిచూసింది. ఆసీస్ బౌలర్లు గార్డెనర్ 2, బ్రౌన్ 2.. జొనాసన్, స్కట్ చెరో వికెట్ తీశారు.
కాగా, అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆసిస్.. ఓపెనర్ బెత్ మూనీ 54, కెప్టెన్ మెగ్ లానింగ్ 49 (నాటౌట్), ఆష్లే గార్డనర్ 31, అలీసా హీలా 25 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో శిఖా పాండే 2, దీప్తి శర్మ 1, రాధా యాదవ్ 1 వికెట్ తీశారు.
స్కోర్ ఇండియా 167/ 8
ఆస్టేలియా ..172/4