కేంద్రంలో అధికారంలోకి వస్తే విభజన హామీలు అమలు చేస్తాం : పొన్నం ప్రభాకర్

కేంద్రంలో అధికారంలోకి వస్తే విభజన హామీలు అమలు చేస్తాం : పొన్నం ప్రభాకర్

తెలంగాణ వచ్చిన పదేళ్ళ తర్వాత ప్రజాపాలన ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారిని అనేక సందర్భాలలో అనేక కోర్కెలు కోరుకున్నానని చెప్పారు. స్వామి వారి దయతో ఆ కోర్కెలు తీరాయని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేలా స్వామి చల్లని చూపు ఉండాలని కోరుకున్నట్టు మంత్రి చెప్పారు.

హుజూరాబాద్ లో ఓ దేవాలయ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని టీటీడీనీ కోరనున్నట్టు పొన్నం ప్రభాకర్ చెప్పారు. కేంద్రంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విభజన హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఓట్లు వస్తాయా వైసీపీ, టీడీపీ ఓట్లు చీలుతాయా అని భవిష్యత్ చెబుతుందని అన్నారు. విభజనతో పాటు అభివృద్ధి కావలి కానీ అలా జరగలేదని పొన్నం విమర్శించారు.