మలేసియా ఓపెన్​లో సైనా, శ్రీకాంత్​ ఓటమి

మలేసియా ఓపెన్​లో సైనా, శ్రీకాంత్​  ఓటమి

కౌలాలంపూర్​: ఇండియా స్టార్​ షట్లర్లు సైనా నెహ్వాల్​, కిడాంబి శ్రీకాంత్​ కొత్త ఏడాదిని ఓటమితో ఆరంభించారు.  మంగళవారం మొదలైన మలేసియా ఓపెన్​లోనూ ఈ ఇద్దరు తొలి రౌండ్​లోనే వెనుదిరిగారు. విమెన్స్​ సింగిల్స్​లో సైనా 12–21, 21–17, 12–21తో హన్​ యూ (చైనా) చేతిలో ఓడింది.  

మెన్స్​లో శ్రీకాంత్​ 19–21, 14–21తో కెంటా నిషిమోటో (జపాన్​) చేతిలో కంగుతిన్నాడు. విమెన్స్​ డబుల్స్​లో ట్రిసా జోలీ–గాయత్రి 21–19, 21–14తో ఎగునా టింగ్​–పు లామ్​ (హాంకాంగ్​)పై నెగ్గి ప్రిక్వార్టర్స్​లోకి అడుగుపెట్టారు.