కౌలాలంపూర్: ఇండియా స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ కొత్త ఏడాదిని ఓటమితో ఆరంభించారు. మంగళవారం మొదలైన మలేసియా ఓపెన్లోనూ ఈ ఇద్దరు తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. విమెన్స్ సింగిల్స్లో సైనా 12–21, 21–17, 12–21తో హన్ యూ (చైనా) చేతిలో ఓడింది.
మెన్స్లో శ్రీకాంత్ 19–21, 14–21తో కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో కంగుతిన్నాడు. విమెన్స్ డబుల్స్లో ట్రిసా జోలీ–గాయత్రి 21–19, 21–14తో ఎగునా టింగ్–పు లామ్ (హాంకాంగ్)పై నెగ్గి ప్రిక్వార్టర్స్లోకి అడుగుపెట్టారు.