అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం : జువ్వాడి నర్సింగరావు

అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం : జువ్వాడి నర్సింగరావు

కోరుట్ల/మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: కాంగ్రెస్  ప్రభుత్వం ఏర్పడిన  18 నెలల్లోనే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని కోరుట్ల నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. బుధవారం కోరుట్లలోని జీఎస్​ గార్డెన్​లో 33 వార్డుల  ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అంటేనే పేదల పార్టీ అని, అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

ఎన్నికల్లో ఓట్ల కోసం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే కొండ్రికర్ల బ్రిడ్జి నిర్మిస్తానని బాండ్ పేపర్ రాసిచ్చాడని, గెలిచాక పట్టించుకోకపోతే తానే సీఎం దగ్గరికి వెళ్లి రూ. 6.80 కోట్లు మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణం పనులకు పునాది వేసినట్లు గుర్తుచేశారు. కోరుట్లలో ఫైర్​ స్టేషన్​ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్​రెడ్డిని కలిసి కోరగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మెట్‌‌‌‌‌‌‌‌పల్లి పట్టణంలోని 1, 2, 21, 22, 23, 24 వార్డులకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. 

వివేక్​ వెంకటస్వామికి ఘన స్వాగతం 

కోరుట్ల, వెలుగు: కోరుట్ల నుంచి మెట్‌‌‌‌‌‌‌‌పల్లికి వెళ్తున్న చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి పట్టణంలోని సాయిబాబా ఆలయం వద్ద కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి జువ్వాడి నర్సింగరావు, లీడర్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను శాలువాలతో సన్మానించారు. అనంతరం జువ్వాడి భవన్‌‌‌‌‌‌‌‌లో  నర్సింగరావు ఏర్పాటు చేసిన తేనేటి విందులో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో కోరుట్ల పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్, అన్నం అనిల్, నాగభూషణం, మధు, లక్ష్మీనారాయణ, లింగం, నయీం ప్రభాకర్​, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.​