- ప్రజలే బుద్ధి చెబుతారు
- కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు
' రాజ్యాంగం నీ అయ్య జాగీరా కేసీఆర్ ? ' ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వీహెచ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎప్పుడు ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారని, అది మంచి పద్ధతి కాదన్నారు. కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే ప్రజలే బుద్ధి చప్తారని వీహెచ్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
కార్ల హెడ్లైట్ల కిందే ఎగ్జామ్ రాశారు
100 కోట్ల జాగిచ్చిన చాయ్ పోయలేదు