పోస్టల్ బ్యాలెట్ పత్రాల పంపిణీ సక్రమంగా జరగాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

పోస్టల్ బ్యాలెట్ పత్రాల పంపిణీ సక్రమంగా జరగాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోస్టల్​ బ్యాలెట్​ పత్రాల పంపిణీ సరిగ్గా జరగాలని జనగామ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్​ భాషా షేక్ అన్నారు. బుధవారం పోస్టల్​ బ్యాలెట్​పంపిణీ, నిర్వహణ మీద అడిషనల్​ కలెక్టర్​ పింకేశ్​ కుమార్ తో కలిసి జడ్పీ సీఈవో, డీపీవో, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలతో కలెక్టర్​ గూగుల్​ మీట్​ ద్వారా రివ్యూ చేశారు. ముందుగా పోస్టల్​బ్యాలెట్​పంపిణీ, నిర్వహణ తదితర అన్ని ప్రక్రియలకు సంబంధించి మాస్టర్​ ట్రైనర్ రామరాజు పవర్​ పాయింట్​ప్రజెంటేషన్​ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు.

అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ మొదటి విడత పోలింగ్​ జరిగే మండలాల్లో ఈ నెల 9వ తేదీ న ఎంపీడీవో ఆఫీస్​లో పోస్టల్​ బ్యాలెట్​కోసం ఫెసిలిటేషన్​ కేంద్రానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రెవెన్యూ శాఖ అధికారి గెజిటెడ్​ అధికారిగా ఫారం 17లో సంతకం చెయ్యడానికి అందుబాటులో ఉంటారన్నారు. సర్వీస్​ ఓటర్లకు పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా తయారైన తర్వాత 24 గంటల లోపు పోస్టు ద్వారా జీపీ ఎన్నికల అధికారి పంపాలన్నారు.

పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని ఎంపీడీవో లను ఆదేశించారు. మొదటి విడత పోలింగ్​ జరిగే మండలాల్లో ఈ నెల 6న పోలింగ్​ అధికారులకు రెండో విడత శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు.