నవోదయ అడ్మిషన్లు తీసుకుంటాం : రాజీవ్​గాంధీ

నవోదయ అడ్మిషన్లు తీసుకుంటాం : రాజీవ్​గాంధీ
  • కలెక్టర్​ రాజీవ్​గాంధీ 

నిజామాబాద్​, వెలుగు: జిల్లాకు కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ రెసిడెన్షియల్ స్కూల్​లో ఈ ఏడాది ఆరో క్లాస్​లో అడ్మిషన్లు తీసుకుంటామని కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. ఏ, బీ రెండు సెక్షన్లు నడిచేలా డైట్ కాలేజీ భవనంలో ఏర్పాట్లు చేస్తామన్నారు. స్కూల్​కు పర్మనెంట్ బిల్డింగ్ నిర్మాణం జరిగేదాకా తాత్కాలికంగా డైట్ కాలేజీ భవనం వినియోగించాలని నిర్ణయించిన నేసథ్యంలో ఆయన అక్కడి సౌకర్యాలు పరిశీలించారు. 

క్లాస్ రూమ్స్​తో పాటు స్టూడెంట్స్​, టీచర్స్​ కోసం తగిన వసతులు ఏర్పాటు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. డార్మెటరీ, డైనింగ్​, లైబ్రరీ కోసం గర్ల్స్​, బాయ్స్​కు వేరు వేరు హాస్టల్ రూమ్, స్టాఫ్ క్వార్టర్స్ ఉండాలన్నారు. ఈ నెల 12 వరకు పనులన్నీ పూర్తి చేయాలన్నారు.  డీఈవో అశోక్​, నవోదయ ఇన్​చార్జ్​ ప్రిన్సిపాల్​ యేహాన్​, పీఆర్​ఈఈ శంకర్​ తదితరులు ఉన్నారు.