
- కలెక్టర్ రాజీవ్గాంధీ
నిజామాబాద్, వెలుగు: జిల్లాకు కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ రెసిడెన్షియల్ స్కూల్లో ఈ ఏడాది ఆరో క్లాస్లో అడ్మిషన్లు తీసుకుంటామని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. ఏ, బీ రెండు సెక్షన్లు నడిచేలా డైట్ కాలేజీ భవనంలో ఏర్పాట్లు చేస్తామన్నారు. స్కూల్కు పర్మనెంట్ బిల్డింగ్ నిర్మాణం జరిగేదాకా తాత్కాలికంగా డైట్ కాలేజీ భవనం వినియోగించాలని నిర్ణయించిన నేసథ్యంలో ఆయన అక్కడి సౌకర్యాలు పరిశీలించారు.
క్లాస్ రూమ్స్తో పాటు స్టూడెంట్స్, టీచర్స్ కోసం తగిన వసతులు ఏర్పాటు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. డార్మెటరీ, డైనింగ్, లైబ్రరీ కోసం గర్ల్స్, బాయ్స్కు వేరు వేరు హాస్టల్ రూమ్, స్టాఫ్ క్వార్టర్స్ ఉండాలన్నారు. ఈ నెల 12 వరకు పనులన్నీ పూర్తి చేయాలన్నారు. డీఈవో అశోక్, నవోదయ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ యేహాన్, పీఆర్ఈఈ శంకర్ తదితరులు ఉన్నారు.