
బెంగళూరుచిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై విచారణ నిమిత్తం కర్ణాటక ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మైఖేల్ డికున్హా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. RCB ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన ఈ ఘటనలో 11 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు.సీఎం సిద్దరామయ్య ఆదేశాల మేరకు కున్హా కమిషన్ ఏర్పాటు చేశారు. 30 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కమిషన్ను కోరారు. కర్ణాటక హైకోర్టు కూడా ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
రిటైర్డ్ జస్టిస్ కున్హా ఎవరు?..
ఎంపీల కేసులను విచారించే ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ జాన్ మైఖేల్ కున్హా. ఈయన 2014లో అప్పటి తమిళనాడు సీఎం జయలలిత కేసులో తీర్పు చెప్పారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను దోషిగా తేల్చడం ద్వారా రిటైర్డ్ జస్టిస్ జాన్ మైఖేల్ కున్హాలు వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత 2016లో కర్ణాటక హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2018లో అక్కడే శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021లో పదవీవిరమణ చేశారు.
SDM లా కాలేజీనుంచి పట్టభద్రుడైన జాన్ మైఖేల్ డి కున్హా 1985లో తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. తర్వాత ఆయన బెంగళూరుకు వెళ్లి కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2002లో న్యాయమూర్తిగా వృత్తిని ప్రారంభించారు. తన పదవీకాలంలో బల్లారీ, ధార్వాడ్, హుబ్లీ, బెంగళూరు జిల్లాల కోర్టులలో పనిచేశారు. 20216లో కర్ణాటక హైకోర్టుకు వచ్చారు.
జూన్ 4న ఆర్సీబీ జట్టు ఐపీఎల్ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో జనం రావడం స్టేడియం ముందు తొక్కిసలాట జరింది.ఈ తొక్కిసలాటలో 11 మంది చనిపోగా, 56 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై బెంగళూరు కమిషనర్ దయానంద్ సహా పలువురు పోలీసు అధికారులను సిద్దరామయ్య ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఈ ఘటనకు సంబంధించి ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసాలేతో పాటు నలుగురిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధికారులు తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
బెంగళూరు తొక్కిసలాటపై న్యాయవిచారణ కోసం కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో దీనిపై విచారణకు సిద్దరామయ్య ప్రభుత్వం రిటైర్డ్ జస్టిస్ జాన్ మైఖేల్ కున్మా కమిషన్ నియమించింది. జూన్ 10న ప్రారంభం కానుంది.