కాకతీయ యూనివర్సిటీ ప్రవేశాలకు గడువు పొడిగింపు

కాకతీయ యూనివర్సిటీ ప్రవేశాలకు గడువు పొడిగింపు

హసన్ పర్తి, వెలుగు : కాకతీయ యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో 2026–-27 విద్యా సంవత్సరానికి దూరవిద్య (ఓడిఎల్ ), ఆన్​లైన్​కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించినట్లు మంగళవారం డైరెక్టర్ బి.సురేశ్​లాల్ తెలిపారు. యూజీసీ-డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ఆదేశాల మేరకు సెప్టెంబర్ 15తో ముగియాల్సిన ప్రవేశాల గడువును వచ్చే నెల 13 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. 

కేయూ దూరవిద్య ద్వారా సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను కేయూ అధికారిక వెబ్​సైట్​ను సంప్రదించాలని తెలిపారు.