ఇద్దరు అంతర్రాష్ర్ట దొంగలు అరెస్ట్ : ఎస్పీ రాజేశ్చంద్ర

ఇద్దరు అంతర్రాష్ర్ట దొంగలు అరెస్ట్ : ఎస్పీ రాజేశ్చంద్ర

కామారెడ్డిటౌన్, వెలుగు : ఇద్దరు అంతర్రాష్ర్ట దొంగలను అరెస్ట్ చేశామని, ఇదే ముఠాకు చెందిన ఒకరిని ఇదివరకే అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రాజేశ్​చంద్ర తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్​ఆఫీస్​లో మీడియాకు ఎస్పీ వివరాలు వెల్లడించారు. జనవరి 2న అశోక్​నగర్ కాలనీలోని ఇంట్లో చోరీ జరగగా, బాధితుడు మాలోతు బాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కామారెడ్డి టౌన్ పోలీసులు దర్యాప్తు చేశారని పేర్కొన్నారు.  స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా అంతర్రాష్ర్ట ముఠా చిక్కిందని తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్​కు చెందిన చిల్లకూరి కృష్ణారెడ్డి అలియాస్ చండీ కృష్ణను  జనవరి 9న అరెస్ట్​చేసి రిమాండ్​కు పంపామన్నారు.

పరారీలో ఉన్న ఇద్దరు జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా రోడ్డులోని బైపాస్ వద్ద సోమవారం అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాలు ఒప్పుకున్నారన్నారు. మెదక్​ జిల్లా నర్సాపూర్ మండలానికి చెందిన మూడావత్ అంజియా,  మేడ్చల్ జిల్లా యాప్రాల్​కు చెందిన సత్యనారాయణ లను అరెస్ట్ చేసినట్లు వివరించారు.  సత్యనారాయణ దొంగల నుంచి సొత్తు కొనుగోలు చేస్తున్నారన్నారు.  

వీరి నుంచి సెల్​ఫోన్​,  89 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కృష్ణారెడ్డి అలియాస్ చండీ కృష్ణ, మూడావత్ అంజియా మన స్టేట్​లోని   మెదక్, సిరిసిల్లా జిల్లాలు, హైదరాబాద్ తదితర ఏరియాలతో పాటు,  ఒడిశాలో గతంలో చోరీలు చేశారని తెలిపారు.  సీఐలు బి.నరహరి, ఎన్​. శ్రీనివాస్​, ఏఎస్సై రంగారావు, సిబ్బంది కమలాకర్, రాజు, సంపత్,  మహేందర్, శ్రీనివాస్​రావు, గణపతిలను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యారెడ్డి, సీఐలు నరహరి, శ్రీనివాస్​ పాల్గొన్నారు.