
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఓ ఇంట్లో నిల్వ ఉంచి తరలించేందుకు సిద్ధంగా ఉన్న 113 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. టౌన్ సీఐ చంద్రశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ కాలనీలో ఓ ఇంట్లో రేషన్ బియ్యం నిల్వ ఉన్నాయనే సమాచారంపై సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.
బియ్యం నిల్వతో పాటు, డీసీఎం వ్యాన్ ఉంది. షేక్అర్భజ్ రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ నుంచి జగిత్యాలకు తరలించేందుకు రెడీగా ఉంచినట్లు సంబంధిత వ్యక్తి ఒప్పుకున్నాడని సీఐ పేర్కొన్నారు. 113 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేసి సివిల్ సప్లయ్ అధికారులకు స్వాధీనం చేశామన్నారు. సివిల్ సప్లయ్ అధికారుల ఫిర్యాదు మేరకు షేక్ అర్బజ్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.