113 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

113  క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

కామారెడ్డి​, వెలుగు :  కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం  ఓ ఇంట్లో నిల్వ ఉంచి తరలించేందుకు సిద్ధంగా ఉన్న 113 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.  టౌన్​ సీఐ చంద్రశేఖర్​రెడ్డి కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని రాజీవ్​నగర్ కాలనీలో ఓ ఇంట్లో రేషన్​ బియ్యం నిల్వ ఉన్నాయనే సమాచారంపై సీసీఎస్​, టాస్క్​ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.

  బియ్యం నిల్వతో పాటు, డీసీఎం వ్యాన్​ ఉంది.   షేక్​అర్భజ్ రేషన్​ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ నుంచి జగిత్యాలకు తరలించేందుకు రెడీగా ఉంచినట్లు సంబంధిత వ్యక్తి ఒప్పుకున్నాడని  సీఐ పేర్కొన్నారు. 113 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్​ చేసి  సివిల్ సప్లయ్ అధికారులకు స్వాధీనం చేశామన్నారు.   సివిల్​ సప్లయ్ అధికారుల ఫిర్యాదు మేరకు షేక్​ అర్బజ్​పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.