కామారెడ్డిటౌన్/బాన్సువాడ, వెలుగు : కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్లో నామినేషన్ల విత్ డ్రా సెంటర్ను మంగళవారం ఎస్పీ రాజేశ్చంద్ర పరిశీలించారు. సెంటర్ వద్ద బందోబస్తు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు పాటించాలన్నారు. సీఐలు నరహరి, రామన్, మధుసూదన్ తదితరులు ఉన్నారు. బాన్సువాడ మున్సిపాలిటీలో నామినేషన్ పత్రాల ఉపసంహరణ వివరాలను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు.
