తిరుమలలో మహిళా భక్తురాలు మృతిచెందింది. కర్ణాటకలోని రాణి బెన్నురుకు చెందిన దుర్గాదేవి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో ఒక్కసారిగా కుప్ప కూలింది. దీంతో కుటుంబసభ్యులు అశ్విని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. కర్ణాటకలోని రాణి బెన్నురుకు చెందిన దుర్గాదేవి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల దర్శనానికి వచ్చారు. శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా క్యూ లైన్ లో ఫిట్స్ రావడంతో సృహ తప్పి పడిపోయింది. దీంతో భక్తురాలి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది. వెంటనే కుటుంసభ్యులు అంబులెన్స్కు సమాచారం అందించారు. కానీ అశ్విని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. . ఆస్పత్రిలో అతన్ని పరిక్షించిన వైద్యులు ఆమె మరణించినట్టు ధృవీకరించారు. దాంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.