
విరాట్ కోహ్లీ అభిమానుల గురించి, అతనికున్న క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. కోహ్లీని ఇన్పిరేషన్ గా తీసుకునేవాళ్లు ఉంటారు. స్టేడియంలో ప్లకార్డులు పట్టుకొని తమ ప్రేమను తెలిపేవాళ్లూ ఉంటారు. నిన్న జరిగిన భారత్,ఆస్ట్రేలియా తొలి టెస్టులో కూడా అలాంటిదే జరిగింది. మ్యాచ్ లో కోహ్లీ ఫ్యాన్ పట్టుకున్న ప్లకార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ విరాట్ అభిమాని ‘నా భార్య కంటే విరాట్ కోహ్లినే ఎక్కువగా ప్రేమిస్తా’ అని ప్లకార్డు ప్రదర్శించాడు. ‘పక్కనే భార్యను ఉంచుకుని ఇంత ధైర్యం చేస్తావా’ అని ఫొటో కింద కామెంట్స్ పెడుతున్నారు.