మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: దుండిగల్ మండలంలోని కొంపల్లి గ్రామంలో ఆర్మీ రీసెర్చ్ కోసం కేటాయించిన 776 ఎకరాల ప్రభుత్వ భూమిని పలువురు కబ్జా చేశారంటూ బీజేపీ నేత ఆకుల సతీశ్ అడిషనల్ కలెక్టర్ విజేందర్రెడ్డికి ఫిర్యాదు చేశారు. సోమవారం మేడ్చల్ కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో దరఖాస్తు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వే నంబర్ తప్పుగా చూపిస్తూ 3.6 ఎకరాల ఆర్మీ భూమిని ఎమ్మెల్యే వివేకానంద అనుచరుడు కిషన్ రావు తో పాటు పలువురు కబ్జా చేశారని ఆరోపించారు. కబ్జా భూమిలో దర్జాగా వెంచర్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. వారిపై చర్యలు తీసుకుని భూమిని కాపాడాలని కోరారు.
