క్రీడలకు అధిక ప్రాధాన్యం: ఆదం సంతోష్‌‌‌‌కుమార్‌‌‌‌

క్రీడలకు అధిక ప్రాధాన్యం: ఆదం సంతోష్‌‌‌‌కుమార్‌‌‌‌

పద్మారావునగర్, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పార్టీ సికింద్రాబాద్‌‌‌‌ నియోజకవర్గ ఇన్​చార్జి ఆదం సంతోష్‌‌‌‌కుమార్‌‌‌‌ తెలిపారు. చిలకలగూడ జీహెచ్‌‌‌‌ఎంసీ పార్కులో షటిల్‌‌‌‌ బాడ్మింటన్‌‌‌‌ కోర్టులను ఆదివారం ఆయన ప్రారంభించారు. 

నగరంలో క్రీడామైదానాల ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం ఆయనను చిలకలగూడ పార్క్​వాకర్స్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ అండ్‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌ సొసైటీ, సికింద్రాబాద్‌‌‌‌ షటిల్‌‌‌‌ రైడర్స్‌‌‌‌ ప్రతినిధులు, క్రీడాకారులు సన్మానించారు. నాయకులు జలంధర్‌‌‌‌రెడ్డి, అనిల్, శిల్పాచారి, కృష్ణ, వహీదుద్థీన్, జగదీశ్వర్​రావు, అమర్నాథ్, రవిశంకర్, వెల్ఫేర్‌‌‌‌ సొసైటీ ప్రతినిధులు బాలరాజు, అనిల్‌‌‌‌ బెన్‌‌‌‌హర్, రఘునందన్, రాజీవ్, ఉమాకాంత్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.