అలుగు వర్షిణిని సస్పెండ్ చేయాలి

అలుగు వర్షిణిని సస్పెండ్ చేయాలి

అంబర్​పేట, వెలుగు: ప్రభుత్వ హాస్టల్​లో చదువుకుంటున్న పిల్లలను టాయిలెట్లు కడగించాలని ప్రిన్సిపాల్ కు ఆదేశాలు ఇచ్చిన ఐఏఎస్​ అలుగు వర్షిణిని వెంటనే సస్పెండ్​ చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల సమైక్య నాయకులు డిమాండ్​ చేశారు. సోమవారం సమైక్య అధ్యక్షులు మహేశ్వర రాజ్ ఆధ్వర్యంలో ఛత్రినాక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అలుగు వర్షిణిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు.