
అంబర్పేట, వెలుగు: ప్రభుత్వ హాస్టల్లో చదువుకుంటున్న పిల్లలను టాయిలెట్లు కడగించాలని ప్రిన్సిపాల్ కు ఆదేశాలు ఇచ్చిన ఐఏఎస్ అలుగు వర్షిణిని వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల సమైక్య నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సమైక్య అధ్యక్షులు మహేశ్వర రాజ్ ఆధ్వర్యంలో ఛత్రినాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలుగు వర్షిణిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు.