సాగర్ కాల్వలో లారీ డ్రైవర్ గల్లంతు..ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో గాలింపు చేపట్టిన పోలీసులు

సాగర్ కాల్వలో లారీ డ్రైవర్ గల్లంతు..ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో గాలింపు చేపట్టిన పోలీసులు

ఖమ్మం రూరల్​, వెలుగు : సాగర్​ కాల్వలో లారీ డ్రైవర్​ గల్లంతయ్యాడు. ఖమ్మం రూరల్​ సీఐ ముష్క రాజు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్ర ఉస్మానాబాద్​ జిల్లా, జైల్​కోట్​ గ్రామానికి చెందిన షేక్​ అహ్మద్​ రసూల్​ (50) లారీ డ్రైవర్​గా జీవనం సాగిస్తున్నాడు. భువనేశ్వర్ నుంచి ముంబాయి లారీ కిరాయికి వెళ్తున్నాడు. 

ఏదులాపురం మున్సిపాలిటీ మద్దులపల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న సాగర్​ కాల్వలో ఆదివారం బట్టలు ఉతుక్కుని, స్నానం చేసేందుకు దిగాడు. ప్రమాదవశాత్తు జారి కాల్వలో పడిపోయాడు. ఈత రకపోవడంతో గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బందితో సుమారు మూడు గంటల పాటు గాలించినా ఆచూకీ   దొరకలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.