
- పోలీసుస్టేషన్ కు వెళ్లి లొంగిపోయిన భర్త
- నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టౌన్ లో ఘటన
ఆర్మూర్, వెలుగు :- అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గుజరాత్కు చెందిన జగదీశ్, మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన మమత(33), పదిహేనేండ్ల కింద పెండ్లి చేసుకున్నారు. వీరు ఆర్మూర్టౌన్లోని వెంకటేశ్వర కాలనీలో నివసిస్తున్నారు. దంపతులకు ఇద్దరు కొడుకులు పవన్, నటరాజ్ ఉన్నారు. మమత విగ్రహాలకు కలర్ వేసే పనులు చేస్తుండగా, జగదీశ్కట్టె మిల్లులో పని చేస్తున్నాడు.
కొద్ది రోజులుగా భార్యపై అనుమానం పెంచుకుని గొడవపడుతుండేవారు. మంగళవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన జగదీశ్మరోసారి భార్యతో గొడవపడ్డారు. కత్తితో భార్య మెడను కోయడంతో స్పాట్ లో చనిపోయింది. అనంతరం జగదీశ్ పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని ఆర్మూర్ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి, ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలి బంధువులకు సమాచారం ఇచ్చామని చెప్పారు.