
మియాపూర్, వెలుగు: నడవలేక పోతున్నానన్న మనోవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మౌనిక తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్జిల్లాకు చెందిన ప్రదీప్రావు(34) భార్య శాంతాబాయి, కూతురు, కుమారుడితో కలిసి మియాపూర్లోని పీఏనగర్ కాలనీలో నివాసం ఉంటూ స్థానికంగా పెయింటర్గా చేస్తున్నాడు.
అతని భార్య ఓ డెంటల్క్లినిక్లో పని చేస్తోంది. 2 నెలల క్రితం ప్రదీప్రావు పెయింటింగ్పనిచేస్తూ ప్రమాదవశాత్తు కింద పడటంతో కాలికి తీవ్ర గాయమైంది. నడవలేని స్థితిలో ఇంటి వద్దే ఉంటున్నాడు. పనికి వెళ్లలేకపోతున్నానని మనస్తాపానికి గురయ్యాడు.
సోమవారం భార్య డ్యూటీకి, పిల్లలు స్కూల్కు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి ప్రదీప్రావు ఉరేసుకొని కనిపించాడు. స్థానికుల సహాయంతో కిందకు దించి చూడగా మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.