
గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఆధ్వర్యంలో ఈ నెల 18న మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఆర్జీ 1 ఏరియా జీఎం డి.లలిత్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. గోదావరిఖని పరిసర ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఎండీ ఎన్.బలరామ్ సూచనలతో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
జాబ్మేళాలో హైదరాబాద్కు చెందిన 100 ప్రైవేటు కంపెనీలు పాల్గొంటున్నాయని, ఆసక్తి గలవారు రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, సర్టిఫికెట్ల జిరాక్స్కాపీలతో ఆర్జీ 1 ఏరియాలోని జీవీటీసీ సెంటర్లో ఈ నెల 16లోపు దరఖాస్తులను అందజేయాలన్నారు.