
సిద్దిపేట రూరల్, వెలుగు: నేడు పల్లెలు పారిశుధ్యం లోపించి చెత్త కుప్పలుగా, మరో వైపు పంచాయతీలు అప్పులకుప్పగా మరాయాని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శనివారం సిద్దిపేట క్యాంప్ ఆఫీస్ లో చిన్నకోడూరు, నంగునూర్ మండలాల గ్రామాల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కి నెలకు రూ. 275 కోట్లు, ఏటా రూ. 3330 కోట్లు ఖర్చు చేశారని గుర్తుచేశారు.
పంచాయతీ పాలన గాడి తప్పిందని, అధికారులు దృష్టి పెట్టి అభివృద్ధి పనులు కొనసాగించాలని ఆదేశించారు. నిధుల కొరత ఉంటే తన దృష్టికి తీసుకరావాలని సూచించారు. నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామం లో జరిగిన మహంకాళి అమ్మవారి దేవాలయ ఉత్సవాల్లో, సిద్దిపేట పట్టణం 1వ వార్డ్ లింగారెడ్డి పల్లిలో గ్రామ దేవతల ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన పద్మశాలి కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
కోహెడ: బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హరీశ్ రావు అన్నారు. గత నెల 27 న నంగునూర్మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద బీఆర్ఎస్సభకు వెళ్లి వస్తున్న వాహనం ఢీకొట్టడంతో కోహెడ మండలం బస్వాపూర్కు చెందిన తాడెం సారయ్య, బండోజు గణేశ్ మృతి చెందారు. శనివారం బస్వాపూర్లో మృతుల కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి పార్టీ తరుపున రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్తో కలిసి అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ర్ట కార్యదర్శి శ్రీహరి, మాజీ ఎంపీపీలు కీర్తి, శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీలు రమేశ్, సురేశ్, అబ్దుల్రహీం, రాజిరెడ్డి పాల్గొన్నారు.