నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటా : ఎమ్మెల్యే మదన్మోహన్రావు

నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటా : ఎమ్మెల్యే మదన్మోహన్రావు
  • ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు

కామారెడ్డి, వెలుగు : నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఏ ఆపదొచ్చిన ఆదుకుంటానని ఎమ్మెల్యే కె.మదన్​మోహన్​రావు హామీ ఇచ్చారు. ఆదివారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్, రాజంపేట, రామరెడ్డి, తాడ్వాయి మండలాలకు చెందిన 53 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 17.57 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు సీఎంఆర్​ఎఫ్​వరంలా మారిందని, ఆపద సమయంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్​నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.