
- ఎమ్మెల్యే మట్టా రాగమయి
కల్లూరు, వెలుగు : పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. శుక్రవారం కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని పుల్లయ్య బంజరలో ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లబ్ధిదారులు సకాలంలో వేగంగా ఇండ్లు నిర్మించుకుంటే విడతల వారీగా డబ్బులు మంజూరు అవుతాయని తెలిపారు.
అనంతరం పుల్లయ్య బంజర రహదారి సమీపంలో గల సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు పూజలు చేశారు. ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ ఆలయ నిర్వాహకులు ఓర్సు అంజి, రామా నగర్ కాలనీకి చెందిన కుంచాల వీరయ్య, తమ్మిశెట్టి దుర్గారావు పలువురు మహిళలు ఎమ్మెల్యే మట్టా రాగమయి, పార్టీ నాయకుడు డాక్టర్ డాక్టర్ దయానంద్, ఏఎంసీ చైర్మన్ భాగం నీరజా దేవిని శాలువాలతో సత్కరించారు.