కవితది ఇంటి పంచాది : ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్

కవితది ఇంటి పంచాది : ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్
  • ఆమెను బీఆర్ఎస్ నేతలే పట్టించుకోవట్లేదు: ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ ను ఇంప్రెస్ చేయడానికే ఎమ్మెల్సీ కవిత ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఆమెది ఇంటి పంచాయితీ అని, తమ పార్టీతో సంబంధం లేదన్నారు. కవితను బీఆర్ఎస్ నేతలే పట్టించుకోవటం లేదని, దీంతో ఆమె ప్రస్టేషన్ కు గురవుతోందన్నారు.  కాళేశ్వరం అంశంలో కమిషన్ నోటీసులు ఇచ్చిందని, రాష్ర్ట ప్రభుత్వం ఇవ్వలేదని మక్కాన్​సింగ్​గుర్తు చేశారు. గురువారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఫార్ములా ఈ కేసును లొట్టపీసు కేసు అన్న కేటీఆర్ ఇపుడు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. 8వ వింత అన్న కాళేశ్వరం మూడు నెలల్లోనే కూలిందని తెలిపారు. 

గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు కవితకు ఎందుకు గుర్తు రాలేదని నిలదీశారు. సింగరేణి ఉద్యోగాల్లో  టీజీబీకేఎస్ సంఘం నేతలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, వాళ్లలో వాళ్లే కేసులు పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని కవిత కోరాలని మక్కాన్ సింగ్ డిమాండ్ చేశారు. సింగరేణి బొగ్గు గనుల వేలంను గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిందన్నారు. సింగరేణి డీఎంఎఫ్ టీ ( డిస్ర్టిక్ మినరల్ ఫౌండేషన్ )  నిధులు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కి తీసుకువెళ్లారని.. ఆ ఫండ్స్ తో లోకల్ ప్రాంతాల అభివృద్ధి జరగాలని మక్కాన్ సింగ్ పేర్కొన్నారు.