అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాలను అభివృద్ధి చేసి తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం జగిత్యాలలోని పలు వార్డులలో టీయూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐడీసీ ఫేజ్ 1లో భాగంగా రూ.25 లక్షల నిధులతో బీటీ రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అనంతరం రైజింగ్‌‌‌‌‌‌‌‌ తెలంగాణ–2047 కార్యక్రమంలో భాగంగా 100 రోజుల పట్టణ ప్రణాళిక అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల అభివృద్ధికి అత్యధిక నిధులు మంజూరయ్యాయని, పట్టణంలో రోడ్లు ఎక్కడ వెడల్పు ఉంటే అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం అంతర్గాం గ్రామంలో మహాలక్ష్మి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో కుటుంబసమేతంగా పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రాజేశం గౌడ్, కమిషనర్ స్పందన, ఏఈ అనిల్, ఏవో శ్రీనివాస్, టీఎంసీ రజిత, జ్యోతి, గిరి నాగభూషణం, లత, నవీన్ పాల్గొన్నారు.