- ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
పిట్లం, వెలుగు : గ్రామాల్లోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. గురువారం పిట్లంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలని కార్యకర్తలకు సూచించారు.
సర్పంచ్లు గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. పిట్లం సర్పంచ్ కుమ్మరి శేఖర్ గ్రామంలోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సెంట్రల్ లైటింగ్ పనులు, కొత్త అంగన్వాడీ భవనాలు, కరెంట్ స్తంభాలు, మురుగు కాలువలు, పాఠశాల భవనాలు, రోడ్ల అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, మండలంలోని సర్పంచ్లు పాల్గొన్నారు.
