
అహ్మదాబాద్ లో జరగనున్న భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్టుకు ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ లు హాజరుకానున్నారు. మార్చి 9న ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కు మొదటి రోజు ఇరు దేశాల ప్రధానులు ప్రత్యేక్షంగా వీక్షించనున్నారు. ప్రధానుల రాక కారణంగా తొలిరోజు ఆటకు సంబంధించిన టికెట్ సేల్స్ ను ఆన్ లైన్ లో బ్లాక్ చేసింది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించట్లేదని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. మొదటి రోజు మినహా మిగిలిన నాలుగు రోజుల మ్యాచ్ టికెట్లు అమ్మకానికి ఉంచింది.
ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధానులు రోజంతా క్రికెట్ చూడరు కదా, ఇంత పెద్ద స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంటే ప్రేక్షకులు లేకపోవడం చూడ్డానికి బాగుందని అభిమానులు అంటున్నారు. సిరీస్ ఫలితాన్నిచ్చే ఈ మ్యాచ్ లో విజయం కోసం ఇరు జట్ల మధ్య గట్టి పోటీ ఉండనుంది. నాలుగో టెస్టులో గెలిచి సిరీస్ చేజిక్కుకోవాలని భారత్, సిరీస్ సమం చేయాలని ఆసీస్ జట్లు చూస్తున్నాయి.