ఖాళీ వంట గిన్నెలతో హాస్టల్ విద్యార్థుల నిరసన

ఖాళీ వంట గిన్నెలతో హాస్టల్ విద్యార్థుల నిరసన

నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించాలంటూ యూనివర్సిటీ గేట్ ముందు బైఠాయించారు. ఖాళీ వంట గిన్నెలతో నిరసన చేపట్టారు. హాస్టళ్లలో కొనసాగుతున్న మెస్ పద్ధతిని మార్చాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. ఇప్పుడున్న హాస్టల్ డైరెక్టర్ ను వెంటనే తొలగించాలన్నారు. గంటల తరబడి ధర్నా చేస్తున్నా వీసీ స్పందించకపోవటంతో.. హైవేపై ధర్నాకు దిగారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ జామ్ అయింది. ధర్నాలో ఓ విద్యార్థి సొమ్మసిల్లి పడిపోయాడు. వీసీతో మాట్లాడిస్తామని పోలీసులు చెప్పటంతో.. వర్సిటీ గేటు ముందు బైఠాయించారు. వీసీ వచ్చి హామీ ఇచ్చేవరకు ధర్నా కొనసాగిస్తామన్నారు విద్యార్థులు.