నిజామాబాద్, వెలుగు : విద్యార్థి దశలో కష్టపడితేనే భవిష్యత్తు బాగుంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థులకు సూచించారు. మంగళవారం నిజామాబాద్ దుబ్బ ఏరియా మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో పదో తరగతి పరీక్షలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నత చదువులకు వెళ్లడానికి టెన్త్ క్లాస్మొదటి మెట్టులాంటిదన్నారు. సర్కార్ హాస్టళ్లలో వసతులు పెరిగాయని, సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కార్పొరేట్కు దీటుగా సర్కారు బడుల్లో విద్య అందుతుందన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుకుతెచ్చుకుని కష్టపడి చదవాలన్నారు. టెన్త్లో 10 గ్రేడ్ పాయింట్స్తో పాసయ్యే స్టూడెంట్స్కు బిగ్ స్క్రీన్పై టి-20 క్రికెట్ వరల్డ్ కప్ లైవ్ చూసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ట్రైనీ కలెక్టర్ కరోలిన్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నర్సయ్య, స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
