AP: మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్

AP: మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఇవాళ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఈనెల 3వ తేదీన బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 15వ తేదీన పోలింగ్.. 17వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గతంలో పలు కారణాలతో ఎన్నికలు జరగని నెల్లూరు కార్పొరేషన్ సహా మున్సిపాలిటీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్ల స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 
జగ్గయ్యపేట, కొండపల్లి, ఆకివీడు, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ తదితర మున్సిపాలిటీలతోపాటు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎన్నికలు జరగకుండా మిగిలిపోయిన స్థానాలకు  ఎన్నికలు జరగనున్నాయి.