
ట్యాంక్ బండ్, వెలుగు: రాష్ట్రంలోని పలు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, ఇప్పటివరకు జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరపాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దిడ్డి సుధాకర్ డిమాండ్చేశారు. దీనిపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశామన్నారు.
ఆదివారం లిబర్టీలోని పార్టీ ఆఫీస్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫుడ్పాయిజన్, విద్యార్థుల మృతిపై సోమవారం జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్లో ఓపెన్ కోర్టు హియరింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాసంఘాలు, మానవ హక్కుల, విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు హాజరై, ఎన్హెచ్ఆర్సీ బృందానికి అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. నాయకులు బుర్ర రాముగౌడ్, జావిద్, నవీన్ పాషా, శ్రీనివాస్, రాజేందర్, శివాజీ తదితరులున్నారు.