హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) కి ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పించి, గ్లోబల్ యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు కసరత్తు జరుగుతోంది. అంచనా వ్యయం రూ.వెయ్యి కోట్లతో చేపట్టే మౌలిక వసతుల అభివృద్ధిపై శనివారం సెక్రటేరియెట్లో ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది.
ప్రభుత్వ సలహాదారు కేశవరావు మార్గదర్శకత్వంలో జరిగిన ఈ భేటీకి విద్యా శాఖ సీనియర్ అధికారులు, కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఐఎస్బీ, ఐఐటీ హైదరాబాద్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను కమిటీ బృందం ఇటీవల సందర్శించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చించింది.
