జనసేన కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్

జనసేన కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్

అమరావతి: జనసేన పార్టీ కొత్త కార్యవర్గాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కొత్త కార్యవర్గం వివరాలను పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కమిటీల్లో 80 శాతం యువతకు అవకాశం కల్పించినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.  రాష్ట్ర కమిటీ నాయకులతోపాటు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను నియమించారు. రాష్ట్ర కార్యవర్గంలోకి చల్లా మధుసూధన్‌రెడ్డి, విజయ్ కుమార్‌, సయ్యద్ ముకరంచంద్ లను తీసుకున్నారు. లీగల్ సెల్‌కి ప్రతాప్, డాక్టర్ సెల్‌కి రఘు, ఐటీ సెల్‌కి శివరాంలను నియమించారు.  చేనేత సెల్‌కి సుభాష్, పార్టీ కార్యక్రమాల రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా కల్యాణపు శ్రీనివాస్‌లను నియమిస్తూ జనసేనాని ఆదేశాలు జారీ చేశారు. అలాగే రాష్ట్రంలోని జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల్లోకి తీసుకున్న వారికి నియామక పత్రాలను సమావేశంలోనే అందజేసి సభికులకు పరిచయం చేశారు. 
జిల్లాలకు కొత్త అధ్యక్షలు వీరే
తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా కందుల దుర్గేష్
పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా గోవింద్
కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణ
విజయవాడ అధ్యక్షుడిగా పోతిన వెంకట మహేష్, కార్యదర్శిగా అమ్మిశెట్టి వాసులు
గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా గాదె వెంకటేశ్వరరావు
ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా షేక్ రియాజ్‌
అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పి.సి.వర్మ
చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పసుపులేటి హరిప్రసాద్‌.