ఇబ్రహీంపట్నం, వెలుగు: పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురాలేదని భార్యతో చనువుగా ఉన్నప్పటి ఫొటోలను సోషల్మీడియాలో పోస్ట్ చేశాడో భర్త. ఎస్సై రాజప్రమీల తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోమటికొండాపూర్ గ్రామానికి చెందిన లాస్యకు ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన నలిమెల సంతోశ్తో నాలుగేళ్ల క్రితం పెండ్లయ్యింది. మూడేండ్ల తర్వాత సంతోశ్ తోపాటు అతని కుటుంబ సభ్యులు లాస్యను పుట్టింటి నుంచి రూ.2లక్షలు అదనపు కట్నం తీసుకురావాలని వేధించడం స్టార్ట్చేశారు. తట్టుకోలేకపోయిన ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అడిగినంత డబ్బు తీసుకురాలేదనే కోపంతో భార్యతో చనువుగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలను సంతోశ్ వాట్సాప్, ఫేస్ బుక్లలో పోస్ట్ చేశాడు. అవి చూసిన లాస్య ఇబ్రహీంపట్నం పీఎస్లో కంప్లైంట్ చేసింది. పోలీసులు గృహహింస, ఐటీ యాక్ట్ల కింద కేసు నమోదు చేసి సోమవారం నిందితుడిని అరెస్టు చేశారు. కాగా సంతోశ్ లాస్యకు విడాకులు ఇవ్వకుండానే నిజామాబాద్జిల్లా భీంగల్కు చెందిన మహిళను నెలరోజుల క్రితం పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
భార్యతో చనువుగా ఉన్న ఫొటోలను..
- క్రైమ్
- September 7, 2021
లేటెస్ట్
- రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 20రూపాయలకే భోజనం...
- బెంగళూరులో ఐటీ దాడులు.. బంగారం, వజ్రాలు స్వాధీనం
- జైళ్లకు భయపడే వ్యక్తి కాదు కేసీఆర్
- DC vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న గుజరాత్.. వార్నర ఔట్
- మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చరిత్ర చంద్రబాబుది.. సీఎం జగన్
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం: యూట్యూబ్కు పోటీగా..XTV యాప్
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- వాలంటీర్లకు హైకోర్టులో ఊరట.. జోక్యం చేసుకోలేమన్న ఈసీ..
- IPL 2024: వార్నర్ దారిలోనే కమ్మిన్స్.. తెలుగు డైలాగ్స్తో అదరగొట్టాడుగా
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి
- T20 World Cup 2024: జూన్ 9న ఇండియా vs పాక్ మ్యాచ్.. పూర్తికాని స్టేడియం నిర్మాణం
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు