భార్యతో చనువుగా ఉన్న ఫొటోలను..

భార్యతో చనువుగా ఉన్న ఫొటోలను..

ఇబ్రహీంపట్నం, వెలుగు: పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురాలేదని భార్యతో చనువుగా ఉన్నప్పటి ఫొటోలను సోషల్​మీడియాలో పోస్ట్ చేశాడో భర్త. ఎస్సై రాజప్రమీల తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోమటికొండాపూర్ గ్రామానికి చెందిన లాస్యకు ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన నలిమెల సంతోశ్​తో నాలుగేళ్ల క్రితం పెండ్లయ్యింది. మూడేండ్ల తర్వాత సంతోశ్ తోపాటు అతని కుటుంబ సభ్యులు లాస్యను పుట్టింటి నుంచి రూ.2లక్షలు అదనపు కట్నం తీసుకురావాలని వేధించడం స్టార్ట్​చేశారు. తట్టుకోలేకపోయిన ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అడిగినంత డబ్బు తీసుకురాలేదనే కోపంతో భార్యతో చనువుగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలను సంతోశ్ ​వాట్సాప్, ఫేస్ బుక్​లలో పోస్ట్ చేశాడు. అవి చూసిన లాస్య ఇబ్రహీంపట్నం పీఎస్​లో కంప్లైంట్​ చేసింది. పోలీసులు గృహహింస, ఐటీ యాక్ట్​ల కింద కేసు నమోదు చేసి సోమవారం నిందితుడిని అరెస్టు చేశారు. కాగా సంతోశ్ లాస్యకు విడాకులు ఇవ్వకుండానే నిజామాబాద్​జిల్లా భీంగల్​కు చెందిన మహిళను నెలరోజుల క్రితం పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.