హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీ సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా అమీర్ పేటలోని గురుద్వార్ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సిక్కు మత పెద్దలు మోదీకి ఘన స్వాగతం పలికి సిరోపా(గౌరవ వస్త్రం) బహూకరించారు. అనంతరం మోదీ భక్తులతో కలిసి కీర్తనలు ఆలకించారు.
అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరవగా వేద పండితులు ఆశీర్వచనాలు ఇవ్వగా.. ఆ తర్వాత ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని రావడంతో ఎన్టీఆర్ స్టేడియం మొత్తం భక్తులు, బీజేపీ అభిమానులు, కార్యకర్తలతో రద్దీగా మారింది. గురునానక్ జయంతి సందర్భంగా ఆయన బోధనల ప్రాముఖ్యతను వివరిస్తూ సోమవారం ఎక్స్(ట్విటర్) ద్వారా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.