శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే బాధ్యతలను మరిచారు. ఎక్కడా చోటు దొరకనట్లుగా ఏకంగా.. అంబులెన్స్లో మందు పార్టీ చేసుకుని..పోలీసు వ్యవస్థ పరువు తీశారు. యూనిఫారం ధరించిన ఇద్దరు పోలీసులు..రన్నింగ్లో ఉన్న అంబులెన్స్లో మద్యం సేవిస్తూ కనిపించారు. ఖాకీలు మద్యం సేవిస్తుండగా..వెనక వాహనంలోని ఓ వ్యక్తి వీడియో తీసి పోస్ట్ చేయడంతో అడ్డంగా బుక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ALSO READ :తీస్తా సెతల్వాద్కు బెయిల్.. హైకోర్టు తీర్పును రద్దు చేసిన సుప్రీంకోర్టు
పంజాబ్ రాష్ట్రం హోషియార్పూర్ సెంట్రల్ జైలులోని అంబులెన్స్ లో ఇద్దరు పోలీసులు మద్యం సేవించారు. వీరు ఓ ఖైదీతో కలిసి మందు పార్టీ చేసుకున్నారు. అంబులెన్స్ ను డ్రైవర్ నడుపుతుండగా..రెడ్ టీ షర్ట్ ధరించిన ఖైదీతో కలిసి అంబులెన్స్ లో బార్ తెరిచారు. చీర్స్ కొడుతూ ఒక్కో పెగ్గు లాగించారు. అయితే పోలీసులు మందు తాగుతుండగా వెనకాల వాహనంలోని ఓ వ్యక్తి వీడియో తీయడంతో ఖాకీల మందు పార్టీ బండారం బయటపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మద్యం సేవించిన పోలీసులపై శాఖాపరమైన విచారణ ప్రారంభించినట్లు సమాచారం.